Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది?

Oxgen plant in sir city

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.130 కోట్ల పెట్టుబడితో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది. ఈ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 27న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటైంది. ప్లాంట్‌ ఏర్పాటు కోసం నోవా ఎయిర్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 24న ఏంఓయూ చేసుకున్న విషయం విదితమే. రోజుకు 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గా్గన్‌ వాయువులు తయారవుతాయి.

చ‌ద‌వండి: ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ సేవ 2.0 పోర్టల్‌ ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం   
ఎప్పుడు  : జనవరి 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : శ్రీ సిటీ, తిరుపతి సమీపం, చిత్తూరు జిల్లా,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Jan 2022 04:37PM

Photo Stories