Skip to main content

Andhra Pradesh: జగనన్న తోడు మూడో విడత కింద ఎంత మొత్తాన్ని విడుదల చేశారు?

Jagananna-Thodu

జగనన్న తోడు పథకం మూడో విడత కింద.. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 28న తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు.

జగనన్న తోడు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత 2020, నవంబర్‌ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అధిక వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులకు సహాయం చేయడమే జగనన్న తోడు పథకం ముఖ్య లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని అంచనా.

రుణం తీర్చిన వారికి మళ్లీ రుణం..
జగనన్న తోడు పథకం కింద రుణం తీసుకొని... ఆ రుణం మొత్తాన్ని వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుంది. ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
 

Naval Exercise: 2022 మిలాన్‌ విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జగనన్న తోడు పథకం మూడో విడత కింద.. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.526.62 కోట్లు విడుదల 
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు  : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Mar 2022 04:56PM

Photo Stories