Skip to main content

Andhra Pradesh Economy: తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం

17.57 శాతం పెరుగుదల.. మూడేళ్లలో 34.88 శాతం వృద్ధి
AP per capita income crossed Rs.2 lakh
AP per capita income crossed Rs.2 lakh

తొలిసారిగా ఏపీ తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది. 2021 – 22కి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయ వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన ప్రొవిజనల్‌ గణాంకాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,07,771కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007 మాత్రమే నమోదు కావడం గమనార్హం. 

Also read: FM Nirmala Sitharaman: ఫైనాన్షియల్‌ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్‌ఎస్‌డీసీ

ఆర్థిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 17.57 శాతం  పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 31,064 పెరిగింది.

మూడేళ్లలో 34.88 శాతం పెరుగుదల
గత సర్కారు దిగిపోయే నాటికి 2018 – 19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్ర మే ఉండగా 2021–22లో ఏకంగా రూ.2,07,771కి పెరిగింది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 34.88 శాతం మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. 

Also read: Irrigation Project Loans: రాష్ట్ర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ రుణాలు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Sep 2022 06:41PM

Photo Stories