Skip to main content

Vikram Kirloskar: విక్రమ్‌ కిర్లోస్కర్ క‌న్నుమూత‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్‌ వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ ఎస్‌ కిర్లోస్కర్‌ (64) గుండెపోటుతో నవంబర్‌ 29వ తేదీ బెంగళూరులో అకాల మరణం చెందారు.

ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మానసి కిర్లోస్కర్‌ ఉన్నారు. విక్రమ్‌ కిర్లోస్కర్‌ మృతితో తాము తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ప్రకటన విడుదల చేసింది. టయోటా కారును భారత్‌కు తీసుకురావడం వెనుక విక్రమ్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవాలి. అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విక్రమ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. జపాన్‌కు చెందిన టయోటాతో కలసి ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు ఆయన వల్లే సాకారం అయింది. ఈ కంపెనీ 1997లో బిడది∙వద్ద 3.10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో కార్యకలాపాలు మొదలు పెట్టింది.

ఇక్క‌డ క్లిక్ చేయండి: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం వివరాలు పొందండి
 

Published date : 01 Dec 2022 06:18PM

Photo Stories