Skip to main content

Publicity Designer: రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు?

Eswar

ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్, రచయిత కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్‌) సెప్టెంబర్‌ 21న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్‌ వయసు 84 ఏళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లుకి చెందిన ఈశ్వర్‌... బాపు దర్శకత్వంలోని ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా శుభారంభం పలికారు. పబ్లిసిటీ డిజైనర్‌గా 40 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేసిన ఆయన... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600కుపైగా చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు (ఫాంట్‌) చాలా వరకు ఈశ్వర్‌ తన తమ్ముడు బ్రహ్మంతో కలసి రూపొందించినవే.

రఘుపతి వెంకయ్య పురస్కారం...

ఈశ్వర్‌ రాసిన ‘సినిమా పోస్టర్‌’కు నంది అవార్డు లభించింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో ఈశ్వర్‌ని సత్కరించింది. అప్పటికి సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రాహకుడు యం.ఎ. రహమాన్‌ (1983) తొలిసారి ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందుకోగా, పబ్లిసిటీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వరే.

చ‌ద‌వండి: స్టీరింగ్‌ కమిటీకి నేతృత్వం వహించనున్న ఇస్రో మాజీ చీఫ్‌?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్, రచయిత కన్నుమూత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్‌)(84)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వయో భారం కారణంగా...

 

Published date : 22 Sep 2021 05:02PM

Photo Stories