Skip to main content

Education Ministry: స్టీరింగ్‌ కమిటీకి నేతృత్వం వహించనున్న ఇస్రో మాజీ చీఫ్‌?

Kasturirangan

జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీని కేంద్ర విద్యాశాఖ సెప్టెంబర్‌ 21న ఏర్పాటు చేసింది. కస్తూరి గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.

మూడేళ్ళ కాలపరిమితితో...

మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)–2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు.

కమిటీలోని సభ్యులు

1. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్‌(చైర్మన్‌)
2 .నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్తుత ఛాన్సలర్‌ మహేష్‌ చంద్ర పంత్‌
3. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌  గోవింద్‌ ప్రసాద్‌ శర్మ
4. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ నజ్మా అక్తర్‌
5. సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ మొదటి వైస్‌–ఛాన్సలర్‌ టి వి కత్తిమణి
6. పద్మశ్రీ మిచెల్‌ డానినో
7. జమ్మూ ఐఐఎం చైర్‌పర్సన్‌ మిలింద్‌ కాంబ్లే
8. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జగ్బీర్‌ సింగ్‌
9. భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త మంజుల్‌ భార్గవ
10. ఎన్‌ఈపీ–2020 డ్రాఫ్ట్‌ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్‌
11. మాజీ ఐఏఎస్‌ అధికారి ధీర్‌ జింగ్రాన్‌
12. ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ సీఈఓ శంకర్‌ మరువాడ

చ‌ద‌వండి: రాష్ట్ర సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ రచించిన కవితా సంకలనం పేరు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : కేంద్ర విద్యాశాఖ
ఎందుకు  : జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం...

 

Published date : 22 Sep 2021 01:48PM

Photo Stories