ఒరిస్సా హైకోర్టులో ప్రస్తుత సీజే ఆగస్టు ఏడున రిటైర్ అయ్యాక జస్టిస్ సుభాషిశ్ సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్ను గుజరాత్ హైకోర్టు సీజేగా నియమించారు. గుజరాత్ హైకోర్టులో జడ్జి అయిన జస్టిస్ ఆశిశ్ జె.దేశాయ్ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.