Telangana: రాష్ట్ర నూతన పీసీసీఎఫ్గా ఎవరు నియమితులయ్యారు?
తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఆర్.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎం డోబ్రియల్కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
ఉత్తరాఖండ్కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా మొదటి పోస్టింగ్ పొందారు. తర్వాతి కాలంలో భద్రాచలం, వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. కన్జర్వేటర్గా పదోన్నతి పొందాక అదనపు కార్యదర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. అనంతరం స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ చాన్స్లర్గా పనిచేశారు.
హరితహారం నోడల్ ఆఫీసర్గా..
తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరిన రాకేశ్ మోహన్ విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు.
చదవండి: కథాసూక్తమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్
ఎందుకు : ఇప్పటివరకు రాష్ట్ర పీసీసీఎఫ్గా ఉన్న ఆర్.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్