Vice President Venkaiah Naidu: కథాసూక్తమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?

గుంటూరు జిల్లా, ఆత్మకూరులో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 1న జరిగిన గురు సన్మానం, 2020–2021 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రమూ కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అనంతరం ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.
ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఎవరు ఉన్నారు?
దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపులో భాగంగా మరిన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్పీవో) ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో సీఐఐ–ఎన్సీడీఈఎక్స్ ఎఫ్పీవో సమ్మిట్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ విషయం వెల్లడించారు రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10వేల ఎఫ్పీవోల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే క్లస్టర్ ఆధారంగా ఒక్కో జిల్లా ఒక్కో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధిస్తుందన్నారు.
చదవండి: సెబీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్’ అనే పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఆత్మకూరు, గుంటూరు జిల్లా
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్