Shanti Bhushan: మాజీ న్యాయ మంత్రి శాంతిభూషణ్ కన్నుమూత
Sakshi Education
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్(97) జనవరి 31న ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
![](/sites/default/files/images/2023/02/06/shanti-bhushanvv-1675684576.jpg)
ఆయన కుమారులు జయంత్, ప్రశాంత్ భూషణ్ సైతం న్యాయవాదులుగా పేరొందారు. 1971 లోక్సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాయ్బరేలీ స్థానంలో అక్రమాలకు పాల్పడి గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసి నెగ్గిన రాజ్ నారాయణ్ తరఫున శాంతి భూషణ్ వాదించారు. ఆ కేసులో ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా కోర్టు ప్రకటించడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-07 జనవరి 2023)
Published date : 01 Feb 2023 05:31PM