Skip to main content

Director of Public Policy: ఫేస్‌బుక్‌ ప్రజా విధానాల అధికారిగా నియమితులైన మాజీ ఐఏఎస్‌?

తమ యూజర్ల సేఫ్టీ, డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ, ఇంటర్నెట్‌ విధానపర నిర్ణయాలను భారత్‌లో అమలుచేసే పబ్లిక్‌ పాలసీ విభాగం డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ అగర్వాల్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇండియా సెప్టెంబర్‌ 20న ప్రకటించింది. గత పబ్లిక్‌ పాలసీ మహిళా డైరెక్టర్‌ అంఖి దాస్‌ స్థానంలో అగర్వాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్‌ పర్యవేక్షణలో రాజీవ్‌ పనిచేస్తారు.

ఐఏఎస్‌ అధికారిగా 26 ఏళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన రాజీవ్‌ గతంలో యూపీలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే తొలిసారిగా మేథో హక్కులకు సంబంధించిన నేషనల్‌ పాలసీలో విధానపర నిర్ణయాల రూపకల్పనలో కీలకంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన పారిశ్రామిక ప్రోత్సహకాలు, అంతర్గత వాణిజ్య విభాగంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.

చ‌ద‌వండి: రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా నియమితులైన వ్యక్తి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పేస్‌బుక్‌ ప్రజా విధానాల అధికారిగా నియమితులైన మాజీ ఐఏఎస్‌?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 20
ఎవరు    : మాజీ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ అగర్వాల్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు  : ఫేస్‌బుక్‌ యూజర్ల సేఫ్టీ, డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ, ఇంటర్నెట్‌ విధానపర నిర్ణయాలను భారత్‌లో అమలుచేసేందుకు...

Published date : 21 Sep 2021 01:20PM

Photo Stories