Dadasaheb Phalke Award: ఆశా పరేఖ్కు ‘దాదాసాహెబ్’
Sakshi Education

1960–70 దశకాల్లో హిందీ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక ఆశా పరేఖ్. అలనాటి ఈ సౌందర్యరాశికి సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ఫాల్కే అవార్డును 2020 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1942లో జన్మించిన ఆశా..1952లో ‘ఆస్మాన్ ’చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కథానాయికగా నటించిన తొలిచిత్రం ‘దిల్దేకే దేఖో’(1959) ఘనవిజయం సాధించడంతో నటిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. చలనచిత్ర రంగంలో అత్యున్నత దాదాసాహెబ్ పురస్కారాన్ని 1969లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 52వ దాదాసాహెబ్ పురస్కార గ్రహీతగా ఆశా పరేఖ్ నిలిచారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 10 Oct 2022 03:30PM