Skip to main content

Chief Secretary of AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా ఎవరు ఉన్నారు?

AP-CS-Sameer-Sharma

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ మే 13న కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2022, నవంబర్‌ 30వ తేదీ వరకు ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే సమీర్‌శర్మ పదవీ కాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. ఆ గడువు 2022, మే నెలాఖరుతో పూర్తి కానుండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సమీర్‌శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించింది.

GK Awards Quiz: 2022 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైనది?
United Arab Emirates: బుర్జ్‌ ఖలీఫా నిర్మాణం ఎవరి పేరు మీద జరిగింది?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ పదవీ కాలం మరో 6 నెలలపాటు పొడిగింపు
ఎప్పుడు : మే 13
ఎవరు    : కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 May 2022 02:57PM

Photo Stories