CAG GC Murmu: భారత కాగ్ జీసీ ముర్ము ఏ అంతర్జాతీయ సంస్థ చైర్మన్గా ఎంపికయ్యారు?
![CAG GC Murmu](/sites/default/files/images/2021/09/08/CAG%20GC%20Murmu-1631110165.jpg)
సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం (ఐఎన్టీఓఎస్ఏఐ) ప్రాంతీయ గ్రూప్లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్ ది ఆసియన్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఓ ఆఫ్ ఎస్ఏఐ) చైర్మన్గా భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) సెప్టెంబర్ 7న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం...
- 2024 నుంచి 2027 వరకూ జీసీ ముర్ము ఏఎస్ఓఎస్ఏఐ చైర్మన్ బాధ్యతల్లో ఉంటారు.
- వియత్నాం రాజధాని హనోయ్లో జరిగిన ఏఎస్ఓఎస్ఏఐ 56వ గవర్నింగ్ బోర్డ్ జీసీ ముర్మును చైర్మన్గా ఎంచుకుంది. ఈ ఎంపికకు సెప్టెంబర్ 7న ఏఎస్ఓఎస్ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.
- ఏఎస్ఓఎస్ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్ నిర్వహిస్తుంది.
1979లో ఏర్పాటు...
సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం 1979 ఏడాదిలో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అసెంబ్లీ ఆఫ్ ది ఆసియన్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఓ ఆఫ్ ఎస్ఏఐ) చైర్మన్గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ము
ఎందుకు : జీసీ ముర్ము ఎంపికకు ఏఎస్ఓఎస్ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేయడంతో...