Skip to main content

Sukhvinder Singh: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌

హిమాచల్‌ప్రదేశ్‌ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు (58) డిసెంబ‌ర్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.
ప్రమాణస్వీకారం సందర్భంగా తల్లితో సుఖ్వీందర్‌

రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి (60) ప్రమాణం చేశారు.  
కౌన్సిలర్‌ నుంచి సీఎం వరకు.. 
అంచెలంచెలుగా ఎదిగిన పోరాట యోధుడు కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి ముఖ్య మంత్రి వరకు సుఖ్విందర్‌ సుఖు అంచెలంచెలుగా ఎదిగారు. సిమ్లాలో వార్డు కౌన్సిలర్, యువజన విభాగం అధ్యక్షుడు,  హమీర్పూర్‌ జిల్లా నాదౌన్‌ ఎమ్మెల్యే, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు సీఎం.. ఇలా అన్ని స్థాయిల్లో పదవుల్ని చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత చరిష్మా ఉన్న దివంగత సీఎం వీరభద్రసింగ్‌ ప్రత్యరి్థగా ఉంటూనే పారీ్టలో స్వయంశక్తితో ఎదిగారు. ఈ ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీకి నేతృత్వం వహించి విజయతీరాలకు చేర్చారు. నాదోన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్‌ అగ్నిహోత్రికి మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వంటి హేమాహేమీల ప్రచారాన్ని తట్టుకుని మరీ గెలిచారు.

Nirmala Sitharaman: ‘ఫోర్బ్స్‌’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్‌

1964 మార్చి 27న నాదోన్‌లో సాధారణ కుటుంబంలో సుఖు జన్మించారు. తండ్రి రషీల్‌ సింగ్‌ రాష్ట్ర రవాణా కార్పొరేషన్‌లో డ్రైవర్‌. విద్యారి్థగా ఫీజుల కోసం సిమ్లాలో పాలమ్మేవారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశాక కాంగ్రెస్‌లో చేరారు. 1989 నుంచి ఆరేళ్ల పాటు విద్యార్థి నేతగా చురుగ్గా ఉన్నారు. 1998 నుంచి పదేళ్లు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర చీఫ్‌గా చేశారు. 1992, 1997ల్లో సిమ్లా కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా నెగ్గారు. 2003లో నాదౌన్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీపై ఆయనకున్న పట్టు, కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం 2013లో పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆరేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా ముఠా సంస్కృతిని ప్రోత్సహించకుండా కార్యకర్తలతో, నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడని పేరుంతివే ఆయన్ను సీఎం పీఠానికి దగ్గర చేశాయి. వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ను కాదని మరీ 25 మంది ఎమ్మెల్యేలు సుఖుకే మద్దతు పలికారంటే ఆయనకున్న మంచిపేరే కారణం. అందుకే అధిష్టానం సుఖు నాయకత్వ సామర్థ్యానికే ఓటేసింది.

Assembly Elections: హిమాచల్‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌కి 40, బీజేపీకి 25 స్థానాలు

Published date : 12 Dec 2022 06:03PM

Photo Stories