Skip to main content

Statue of Unity: రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఎప్పుడు నిర్వహించనున్నారు?

Statue of Unity

గుజరాత్‌ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు అక్టోబర్‌ 17న ప్రకటించారు. పటేల్‌ 147వ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాలను(రాష్ట్రీయ ఏక్తా దివస్‌) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఏక్తా దివస్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహంను పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018, అక్టోబర్‌ 31న ఆవిష్కరించారు.

నర్సరీ రాజ్యానికి రారాజు పుస్తకావిష్కరణ

ఎమెస్కో బుక్స్‌ ప్రచురించిన ‘‘నర్సరీ రాజ్యానికి రారాజు–పల్ల వెంకన్న’’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అక్టోబర్‌ 17న హైదరాబాద్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని జి.వల్లీశ్వర్‌ రచించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ(ఐక్యతా విగ్రహం) సందర్శన నిలిపివేత
ఎప్పుడు : అక్టోబర్‌ 17
ఎవరు : ప్రభుత్వం
ఎక్కడ  : కేవాడియా, నర్మదా జిల్లా, గుజరాత్‌ రాష్ట్రం
ఎందుకు : రాష్ట్రీయ ఏక్తా దివస్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా...

చదవండి: ఐక్యతా విగ్రహం రూపకర్త ఎవరు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Oct 2021 06:46PM

Photo Stories