Skip to main content

Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌

ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. అలాగే, డిప్యూటీ మేయర్‌ పదవికి ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ కొడుకు ఆలె మహ్మద్‌ ఇక్బాల్‌ పేరును ఖరారు చేసింది.

ఇంకా స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా రమీందర్‌ కౌర్, సారికా చౌధరి, మోహినీ జీన్‌వాల్, మహ్మద్‌ ఆమిల్‌ మాలిక్‌ ఇక్బాల్‌లను ఎంపిక చేసినట్లు ఆప్‌ సీనియర్‌ నేత పంకజ్‌ గుప్తా తెలిపారు. డిసెంబ‌ర్ 23న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించిన మీదట ఆయా పదవులకు వీరిని ఎంపిక చేశామన్నారు. ఢిల్లీ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 250 సీట్లకు గాను ఆప్‌ 134 స్థానాలను గెలుచుకుని, 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టిన విషయం తెలిసిందే.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 24 Dec 2022 04:18PM

Photo Stories