Khadi Utsav Event 2022: చరఖాతో 7,500 మంది మహిళల రికార్డు
Sakshi Education

అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలన్న కల నెరవేరడానికి, స్వావలంబన సాధించడానికి ఖాదీయే స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.'ఆజాదీ కా అమృత్ మహోత్సవం'లో భాగంగా సబర్మతి నదీ తీరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన 'ఖాదీ ఉత్సవ్'లో మోదీ ప్రసంగించారు. దీనిలో ఒకేసారి 7,500 మంది మహిళలు చరఖా తిప్పి నూలు వడకడం ద్వారా కొత్త రికార్డు సృష్టించారు. సబర్మతి నదిపై సర్వాంగ సుందరంగా నిర్మించిన 'అటల్కాలిబాట వంతెన'ను, అహ్మదాబాద్లో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 06 Sep 2022 06:53PM