Skip to main content

PM Modi: ’మన్‌ కీ బాత్‌’కు 23 కోట్ల శ్రోతలు

PM Modi's 'Mann ki Baat' has 23 crore regular listeners

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ’మన్‌ కీ బాత్‌’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌–రోహతక్‌ ఈ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం–100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్‌ కీ బాత్‌ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్‌ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం– రోహతక్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ పి.శర్మ చెప్పారు. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్‌ కీ బాత్‌ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్‌ ద్వివేది పేర్కొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 06:43PM

Photo Stories