Skip to main content

PM Modi: అరుణాచల్‌లో డోనీ పోలో విమానాశ్రయం ప్రారంభం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు.
PM Modi inaugurates Donyi Polo Airport, Itanagar

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమానాశ్రయంతో టూరిజంను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇటానగర్‌లోని హోలంగిలో ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సుమారు రూ.645 కోట్ల ఖర్చుతో డోనీ పోలో విమానాశ్రయాన్ని నిర్మించింది. బోయింగ్‌ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్రయాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్య 16కు చేరింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 05:23PM

Photo Stories