Skip to main content

Pakistan Terrorists: భీకర ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

పాకిస్తాన్‌ నుంచి చొరబడిన నలుగురు సాయుధ ఉగ్రవాదులు డిసెంబ‌ర్ 28న జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై ఎదురు కాల్పుల్లో హతమయ్యారు.

గణతంత్ర దినోత్సవాల ముందు ఇది అతిపెద్ద విజయమని జమ్మూ జోన్‌ అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌ చెప్పారు. ‘‘ఓ వాహనంలో ఉన్న ముష్కరులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. తర్వాత వాహనం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఏడు ఏకే అసాల్ట్‌ రైఫిల్స్, ఒక ఎం4 రైఫిల్, 3 పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రి దొరికాయి. పారిపోయిన వాహనం డ్రైవర్‌ కోసం గాలిస్తున్నాం. జమ్మూలోని నార్వాల్‌ బైపాస్‌ ఏరియాలో ఓ ట్రక్కు నుంచి ఇటీవలే పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో హైఅలర్ట్‌లో భాగంగా తనిఖీలు చేస్తుండగా జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న వాహనంలో నలుగురు పాకిస్తాన్‌ ఉగ్రవాదులు తారసపడ్డారు’’ అని తెలిపారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 29 Dec 2022 11:49AM

Photo Stories