Chandipura Virus: గుజరాత్, రాజస్థాన్లలో ప్రమాదకర వైరస్ కలకలం
Sakshi Education
అత్యంత ప్రమాదకరమైన చాందిపురా వైరస్ ఇప్పుడు గుజరాత్ను దాటి రాజస్థాన్లోకి ప్రవేశించింది.
![Chandipura Virus Found In Gujarat and Rajasthan](/sites/default/files/images/2024/07/16/chandipura-virus-1721128910.jpg)
రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యాధికారులు తెలిపిన వివరాలు ఇవే..
- ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వాడా బ్లాక్లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్ కేసులు నమోదయ్యాయి.
- ఖేర్వాడా బ్లాక్లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారినపడి హిమ్మత్నగర్లో చికిత్స పొందుతున్నారు.
- ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు.
- ఈ వైరస్ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.
- చాందిపురా వైరస్ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.
- బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Zika Virus: జాగ్రత్త.. కలకలం రేపుతున్న జికా వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
Published date : 16 Jul 2024 04:51PM