Edible Oil: కేంద్రం కీలక నిర్ణయం.. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
Sakshi Education
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
![Edible Oil](/sites/default/files/images/2023/06/16/oil-1686895390.jpg)
రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ జూన్ 15న ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది.
Wheat To Check Prices: గోధుమ నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం
Published date : 16 Jun 2023 11:33AM