Skip to main content

Vande Bharat Express: వందేభారత్‌ రైళ్ల సరాసరి వేగం 83 కిలోమీటర్లు

దేశంలో వందేభారత్‌ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
Vande Bharat Express

గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్‌ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్‌– తుగ్లకాబాద్‌ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది.

Vande Bharat Express: సికింద్రాబాద్‌–తిరుపతి మ‌ధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం.. 

Published date : 18 Apr 2023 05:06PM

Photo Stories