Assam government: అస్సాంలో సుస్థిర శాంతి దిశగా ఒప్పందం
Sakshi Education

అస్సాంలోని కొన్ని కల్లోల ప్రాంతాల్లో సుస్థిర శాంతి దిశగా కీలక ముందడుగు పడింది. ఆ రాష్ట్రానికి చెందిన పలు గిరిజన తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వమూ భాగస్వామ్యమైన ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్ ఆఫ్ అస్సాం, బిర్సా కమాండో ఫోర్స్, సంతాల్ౖ టెగర్ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ సంస్థలకు చెందిన ప్రతినిధులు కేంద్ర హోంమంత్రి అమిత్షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరుల సమక్షంలో సంతకాలు చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 03 Oct 2022 05:53PM