Skip to main content

Andhra Pradesh: పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీకి 5వ స్థానం

andhra pradesh ranks 5th in the production of fruits and vegetables

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలో 5వ స్థానంలో నిలిచింది. 2011–12 నాటి స్థిర ధరల ప్రకారం–ఈ రెండింటి దిగుబడిలో ఏపీ వాటా 5.8% మేర ఉండగా.. 2020–21 నాటికి అది 8.3%కి చేరింది. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం 7 నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌ (11.7%), మధ్యప్రదేశ్‌ (10. 8%), ఉత్తరప్రదేశ్‌ (9.7%), మహారాష్ట్ర (9.6%).. ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల స్థూల విలువ 2011–12లో రూ.16,500 కోట్ల మేర ఉండగా.. 2020–21 నాటికి రూ. 32,900 కోట్లకు చేరింది. లైవ్‌ స్టాక్‌ ఉత్పత్తిలోనూ 7.9% వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల్లో దేశంలో 40% వాటా సాధించి టాప్‌లో నిలిచింది. ఈ రంగంలో 2015–16 నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. పదేళ్లలో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 17.7% నుంచి 40%కి ఎగబాకింది. అరటి ఉత్పత్తిలోనూ 2014–15 నుంచి ఏపీ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. జాతీయస్థాయిలో మొత్తం స్థూల అదనపు విలువలో(జీవీఏ) వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల వాటా 2011–12లో 18.5% మేర ఉండగా, 2020–21 నాటికి అది 20.3శాతానికి పెరిగింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 07:10PM

Photo Stories