Skip to main content

New Delhi: అమరజవాన్‌ జ్యోతిని ఎందులో విలీనం చేశారు?

Amar Jawan Jyoti

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని అమర జవాన్‌ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో కలిపేశారు. ఇక నుంచి యుద్ధ స్మారక అఖండ జ్యోతి దగ్గరే అమర జవాన్లకు నివాళులర్పించాలని జనవరి 21న మిలిటరీ అధికారులు తెలిపారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించిన అనంతరం అమరులైన భారత సైనికుల త్యాగానికి గుర్తుగా స్మారక జ్యోతి(అమర జవాన్‌ జ్యోతి)ని నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. అలాంటి చరిత్రాత్మక అఖండ జ్యోతిని...  ఇండియా గేట్‌కు 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక స్థలంలో ఉన్న జ్యోతిలో కలిపేశారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్రమోదీ ఈ స్థలాన్ని ప్రారంభించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన 25,942 మంది సైనికుల పేర్లను గ్రానైట్‌లేబుల్స్‌పై సువర్ణాక్షరాలతో లిఖించారు.

50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్‌ జ్యోతిని ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగిన కార్యక్రమం ద్వారా జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో కలిపారు. అమర్‌జవాన్‌ జ్యోతిని ఆర్పేయడం లేదని, యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయని.. అందువల్ల అమర జవాన్ల కోసం జ్యోతిని అక్కడ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

చ‌ద‌వండి: విఖ్యాత పులి కాలర్‌వాలీ ఇక లేదు

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమర జవాన్‌ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక అఖండ జ్యోతిలో విలీనం 
ఎప్పుడు : డిసెంబర్‌ 21
ఎవరు    : ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలోని బృందం
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Jan 2022 01:26PM

Photo Stories