Delhi: ఢిల్లీలో సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే
Sakshi Education
![All sub registrars in Delhi to be women](/sites/default/files/images/2022/12/23/vk-saxena-1671800727.jpg)
ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ మేరకు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజిష్ట్రేషన్ లాంటి అన్ని అంశాలను ఇక నుంచి మహిళా ఆఫీసర్లే రిజిస్టర్ చేయనున్నారు. ఢిల్లీ సర్కార్లోని రెవన్యూ శాఖలో ఉన్న 22 సబ్ రిజిస్ట్రార్స్ పోస్టుల్లో ఇప్పుడు మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నారు. మహిళా ఆఫీసర్లు ఉన్నత హోదాల్లో ఉండడం వల్ల అవినీతి, వేధింపులు, రెడ్టేపీజం ఉండవని ఎల్జీ ఆఫీసు తన ప్రకటనలో పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 23 Dec 2022 06:35PM