Skip to main content

Army Jawans: రోడ్డు ప్రమాదంలో 16 మంది భారత జవాన్ల దుర్మరణం

డిసెంబ‌ర్ 23న(శుక్ర‌వారం) ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డ‌డంతో 16 మంది దుర్మరణం చెందారు.

మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్‌ కమిషన్‌ అధికారులున్నారు.  భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో చాటేన్ నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జవాన్లు అందించిన సేవలు మరువలేనివని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 23 Dec 2022 05:17PM

Photo Stories