UN Secretary General: ప్రకృతి పరిరక్షణలో సహకరించుకోకపోతే వినాశనమే
Sakshi Education
పర్యావరణంలో ప్రతికూల మార్పులను నివారించేందుకు అన్ని దేశాలు తక్షణం ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు.
![Antonio Guterres](/sites/default/files/images/2022/11/18/antonio-guterres-1668779479.jpg)
పరస్పర సహకారంతో ముందుకుసాగకపోతే వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. సంపన్న దేశాల్లో 2030 కల్లా, ఇతర దేశాల్లో 2040 కల్లా బొగ్గు వినియోగం నిలిచిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ఛేంజ్(యుఎన్ ఎఫ్సీసీసీ)’ పేరుతో ఐరాస ఓ వేదికను ఏర్పాటుచేసింది. ఇందులో భాగస్వామ్యమైన సుమారు 200 దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్)గా పిలుస్తున్నారు. తొలి సదస్సు 1995లో బెర్లిన్ లో జరగ్గా.. నిరుడు కాప్ 26ను యూకేలోని గ్లాస్గోలో నిర్వహించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 18 Nov 2022 07:21PM