PM Narendra Modi: జీ–20 లోగోను విడుదల చేసిన మోదీ
Sakshi Education
జీ–20 కూటమికి భారత నేతృత్వానికి సంబంధించి లోగోను, ఇతివృత్తాన్ని, వెబ్సైట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో ఆవిష్కరించారు.
![PM Narendra Modi unveils G20 logo](/sites/default/files/images/2022/11/18/g20-1668779005.jpg)
ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ–20 అధ్యక్షత బాధ్యతను డిసెంబరు1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా సమాజం(యూరోపియన్ యూనియన్ ) సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జీ–20 శిఖరాగ్ర సమావేశం నవంబరు 15–16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో జరగనుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 18 Nov 2022 07:13PM