Skip to main content

India-Belgium Relations: ఈ రంగాలలో సహకారం మరింత బలోపేతం!!

బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డీ క్రూతో ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ మార్చి 26వ తేదీ సంభాషించారు.
Official meeting between Indian and Belgian representatives     Prime Minister Narendra Modi speaking with Belgian Prime Minister Alexandre de Crewe.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇప్పటికే బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు.

బ్రస్సెల్స్‌లో జరిగిన మొదటి అణు ఇంధన సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై పీఎం డీ క్రూను మోదీ అభినందించారు.

పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.

వారు భారతదేశం, బెల్జియం దేశాల‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడి, క్లీన్ టెక్నాలజీస్, సెమీకండక్టర్స్, ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఐటి, డిఫెన్స్,  పోర్ట్‌లు వంటి బహుళ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించారు.

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సహకారం, మద్దతు యొక్క ప్రాముఖ్యతపై కూడా వారు అంగీకరించారు.

Operation Indravati: ఆపరేషన్‌ ఇంద్రావతి.. హైతీ నుంచి భారతీయుల తరలింపు!!

ముఖ్య అంశాలు..
➤ బెల్జియం ప్రధానితో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషణ
➤ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై దృష్టి
➤ అణు ఇంధన సదస్సు విజయానికి అభినందనలు
➤ ప్రాంతీయ & ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడి
➤ బహుళ రంగాలలో సహకారం పెంచడం
➤ పశ్చిమాసియా & రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చ

Published date : 27 Mar 2024 10:47AM

Photo Stories