Skip to main content

Electronic Chip: చిప్‌ల తయారీలో రూ.1,49,200 కోట్ల పెట్టుబడి పెట్టునున్న సంస్థ?

Vedanta

ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ విభాగాల కోసం రూ.1,49,200 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు పారిశ్రామిక దిగ్గజ సంస్థ వేదాంత ఫిబ్రవరి 18న ప్రకటించింది. 2024 కల్లా డిస్‌ప్లే ఉత్పత్తి కేంద్రం, 2025 నాటికి చిప్స్‌ తయారీ ప్లాంట్‌ సిద్ధం కానుంది. మొత్తం ఉత్పత్తిలో 25–30 శాతం ఎగుమతి చేయనున్నారు. తయారీ కేంద్రాల స్థాపనకై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రోత్సాహకాలను ప్రకటించిన తర్వాత..

భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తికై జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో వేదాంత గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గ్రూప్‌ అనుబంధ కంపెనీ అవాన్‌స్ట్రేట్‌ డిస్‌ప్లే వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వం రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించిన తర్వాత.. ఈ విభాగంలో పెట్టుబడి ప్రకటన చేసిన మొదటి కంపెనీ వేదాంతనే.

చ‌ద‌వండి: కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
 

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూ.1,49,200 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : పారిశ్రామిక దిగ్గజ సంస్థ వేదాంత
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ విభాగాల కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Feb 2022 05:02PM

Photo Stories