Skip to main content

Semicon India Conference 2022: సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?

Chip

వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) దేశీయంగా 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఏప్రిల్‌ 19న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం 70–80 బిలియన్‌ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సెమీకాన్‌ ఇండియా 2022 సదస్సుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

International Monetary Fund: ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ కలిగిన దేశం?

బెంగళూరు వేదికగా..
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్‌ 29–మే 1 మధ్య బెంగళూరులో జరగనుంది. ఈ సదస్సులో పలు దిగ్గజ సెమీకండక్టర్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని మంత్రి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.
 

PHDCCI: భారత్‌ 2022–23లో ఎన్ని బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించనుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సెమీకాన్‌ ఇండియా తొలి సదస్సు ఏప్రిల్‌ 29–మే 1 మధ్య జరగనుంది
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చే దిశగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Apr 2022 03:06PM

Photo Stories