Skip to main content

Bad Bank: మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న బ్యాంక్‌?

FM Nirmala

బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబర్‌ 17న తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని చెప్పారు. 2018 మార్చి నుంచి చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

నిర్వహణా తీరు ఇది... 

ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్‌ నుంచి మొండిబకాయి (ఎన్‌పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్‌ ఉంటాయి. ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో  నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది.

 

2021–22 బడ్జెట్‌లో ప్రతిపాదన...

2021–22 ఆర్థిక సంవత్సరం బడెట్‌  ఆర్థికమంత్రి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోషియేషన్‌ (ఐబీఏ) బ్యాడ్‌ బ్యాంక్‌(ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ను ఏర్పాటు చేయనుంది. బ్యాడ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 16 మంది షేర్‌హోల్డర్లు ఉంటారు.

చ‌ద‌వండి: టెలికం రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎన్‌ఏఆర్‌సీఎల్‌ లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీకి సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 16
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు  : బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు...

 

Published date : 17 Sep 2021 04:48PM

Photo Stories