Skip to main content

The Wealth Report 2023: దేశంలో త‌గ్గిన అత్యంత సంపన్నులు..!

భారతదేశంలో 30 మిలియన్ డాలర్ల (రూ.246 కోట్లు) పైన నెట్వర్త్ ఉన్న అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య గత ఏడాది 7.5 శాతం తగ్గి 12,069కి చేరినట్లు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది.
The Wealth Report 2023

అయితే రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 19,119 పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ తెలిపారు. ఇదే జరిగితే పెరుగుదల పరిమాణం 58.4 శాతమన్నమాట.  ‘‘ది వెల్త్ రిపోర్ట్ 2023’’ శీర్షికన ఆయా అంశాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తాజా నివేదిక తెలిపిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే.. 
☛ భారత్ బిలియనీర్లు 2021లో  145 ఉంటే, 2022నాటికి 161కి పెరిగింది. 2027 నాటికి 195 మందికి ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా.  
☛ దేశంలో మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగిన సంపన్నుల జనాభా 2021లో 7,63,674 ఉంటే, 2022లో 7,97,714కి పెరిగింది. 2027 నాటికి ఈ జనాభా 16,57,272కు చేరుతుందని అంచనా..  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
☛ భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2022లో అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో మాత్రం 9.3 శాతం పెరిగింది.  
☛ ఆర్థిక మందగమనాలు, తరచుగా రుణ రేట్ల పెంపుదల,  పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అత్యంత సంపన్నుల సంపద,  పెట్టుబడి పోర్ట్ఫోలియో ప్రభావితమవుతోంది. 
☛ భారత్ విషయానికి వస్తే, వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయిపై డాలర్ బలోపేతం వంటి అంశాలు వ్యక్తుల నెట్వర్త్ పెరుగుదలపై ప్రభావితం చూపిస్తోంది.

Mahila Samman Scheme: మహిళా సమ్మాన్‌ డిపాజిట్‌పై టీడీఎస్‌ లేదు

Published date : 19 May 2023 03:45PM

Photo Stories