Skip to main content

Stock Market: మార్కెట్‌ విలువలో భారతదేశ స్థానం ఎంత?

BSE
ఫైల్ ఫొటో

భారత స్టాక్‌ మార్కెట్లో సెప్టెంబర్‌ 24న సరికొత్త రికార్డు నమోదైంది. సెన్సెక్స్‌ సూచీ తన 42 ఏళ్లలో సుధీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. సెప్టెంబర్‌ 24న... సెన్సెక్స్‌ 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ఈ విషయమై బీఎస్‌ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... ‘‘సెన్సెక్స్‌ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్‌ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్‌ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది.’’ అని పేర్కొన్నారు.

మార్కెట్‌ విలువలో ఆరో స్థానానికి భారత్‌
అమెరికా     51 ట్రిలియన్‌ డాలర్లు
చైనా 12 ట్రిలియన్‌ డాలర్లు
జపాన్‌     7 ట్రిలియన్‌ డాలర్లు
హాంకాంగ్‌ 6 ట్రిలియన్‌ డాలర్లు
బ్రిటన్‌     3.6 ట్రిలియన్‌ డాలర్లు
భారత్‌ 3.54 ట్రిలియన్‌ డాలర్లు
ప్రాన్స్‌ 3.41 ట్రిలియన్‌ డాలర్లు

 

చ‌ద‌వండి: కేంద్ర ఆవిష్కరించిన సింగిల్‌ విండో పోర్టల్‌ ఉద్దేశం?

Published date : 25 Sep 2021 04:17PM

Photo Stories