Skip to main content

Air India Takeover: ఎయిరిండియా సొంతం చేసుకున్న సంస్థ?

air india

తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు జనవరి 27న అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. టాటా గ్రూప్‌ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇదే తొలి ఎయిర్‌లైన్స్‌..

టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ (జేఆర్‌డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్‌’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్‌. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి..

  • 1946: టాటాసన్స్‌ ఏవియేషన్‌ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు.
  • 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. 
  • 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది.
  • 1994–95: ఏవియేషన్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్‌ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్‌ వాటాను కోల్పోతూ వచ్చింది.
  • 2017 జూన్‌: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 
  • 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ ఒక్క బిడ్‌ కూడా రాలేదు.
  • 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 
  •  2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది.
  • 2021 ఏప్రిల్‌: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్‌ 15 చివరి తేదీ.
  • 2021 సెప్టెంబర్‌: టాటా గ్రూపు, స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ నుంచి బిడ్లు వచ్చాయి.
  • 2021 అక్టోబర్‌ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్‌ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.
  • 2021 అక్టోబర్‌ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది.
  • 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది.

చ‌ద‌వండి: ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : జనవరి 27    
ఎవరు    : పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Jan 2022 03:27PM

Photo Stories