ముస్తాక్ అలీ ట్రోఫీకి ఏ క్రీడతో సంబంధం ఉంది?
Sakshi Education
కరోనా కారణంగా 2020–2021 ఏడాది రంజీ ట్రోఫీతోపాటు పలు వయో పరిమితి విభాగం టోర్నీలను నిర్వహించలేకపోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది మాత్రం పూర్తిస్థాయిలో దేశవాళీ క్రికెట్ సీజన్ను నిర్వహించడానికి సిద్ధమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–2022 ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ ప్రకటన
ఎప్పుడు : జూలై 3
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా
2021–2022 దేశవాళీ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ కార్యదర్శి జై షా జూలై 3న విడుదల చేశారు.
జై షా తెలిపిన వివరాల ప్రకారం...
జై షా తెలిపిన వివరాల ప్రకారం...
- దేశవాళీ క్రికెట్ సీజన్ 2021, సెప్టెంబర్ 21న సీనియర్ మహిళల వన్డే లీగ్తో మొదలవుతుంది. 2022 ఏప్రిల్ 11న సీనియర్ మహిళల టి20 లీగ్తో ముగుస్తుంది.
- ఇక ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీ నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు జరుగుతుంది.
- ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు... విజయ్ హజారే ట్రోఫీ వన్టే టోర్నీని 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు నిర్వహిస్తారు.
- వీటితోపాటు అండర్–23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీని, అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ, అండర్–16 కూచ్ బిహార్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ టోర్నీలు కూడా జరుగుతాయి.
- సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల విభాగాల టోర్నీలన్నింటిలో కలిపి మొత్తం 2,127 మ్యాచ్లు జరుగుతాయి.
- గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ (ఇంటర్ జోనల్), దేవధర్ ట్రోఫీ మ్యాచ్లను నిర్వహించడం లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–2022 ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ ప్రకటన
ఎప్పుడు : జూలై 3
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా
Published date : 05 Jul 2021 05:26PM