Skip to main content

ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ఏ క్రీడతో సంబంధం ఉంది?

కరోనా కారణంగా 2020–2021 ఏడాది రంజీ ట్రోఫీతోపాటు పలు వయో పరిమితి విభాగం టోర్నీలను నిర్వహించలేకపోయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది మాత్రం పూర్తిస్థాయిలో దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.
Current Affairs
2021–2022 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా జూలై 3న విడుదల చేశారు.

జై షా తెలిపిన వివరాల ప్రకారం...
  • దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ 2021, సెప్టెంబర్‌ 21న సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో మొదలవుతుంది. 2022 ఏప్రిల్‌ 11న సీనియర్‌ మహిళల టి20 లీగ్‌తో ముగుస్తుంది.
  • ఇక ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీ నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు జరుగుతుంది.
  • ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీని అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు... విజయ్‌ హజారే ట్రోఫీ వన్టే టోర్నీని 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు నిర్వహిస్తారు.
  • వీటితోపాటు అండర్‌–23 కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీని, అండర్‌–19 వినూ మన్కడ్‌ ట్రోఫీ, అండర్‌–16 కూచ్‌ బిహార్‌ ట్రోఫీ, విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ టోర్నీలు కూడా జరుగుతాయి.
  • సీనియర్, జూనియర్‌ పురుషుల, మహిళల విభాగాల టోర్నీలన్నింటిలో కలిపి మొత్తం 2,127 మ్యాచ్‌లు జరుగుతాయి.
  • గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరానీ కప్, దులీప్‌ ట్రోఫీ (ఇంటర్‌ జోనల్‌), దేవధర్‌ ట్రోఫీ మ్యాచ్‌లను నిర్వహించడం లేదు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2021–2022 ఏడాది దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకటన
ఎప్పుడు : జూలై 3
ఎవరు : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా
Published date : 05 Jul 2021 05:26PM

Photo Stories