Skip to main content

Ramakrishna Mission: రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామి గౌతమానంద్‌జీ

రామకృష్ణ మఠం, మిషన్‌కు స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా ఎన్నికయ్యారు.
Swami Gautamanandaji Maharaj Elected New Chief Of Ramakrishna Mission

గత నెలలో కోల్‌కతాలో మరణించిన స్వామి స్మరణానందజీ మహారాజ్‌కు వారసుడిగా స్వామి గౌతమానంద్‌జీ బాధ్యతలు చేపట్టారు.
95 ఏళ్ల గౌతమానంద్‌జీని బేలూర్‌ మఠంలో సమావేశమైన ట్రస్టీల బోర్డు ఎన్నుకుంది.

స్వామి గౌతమానంద్‌జీ గురించి..
➤ 1929లో జన్మించిన స్వామి గౌతమానంద్‌జీ 1953లో రామకృష్ణ మఠంలో చేరారు.
➤ ఆయన అనేక బాధ్యతలు నిర్వహించి, 2017లో మఠం యొక్క ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
➤ ఆధ్యాత్మిక ప్రసంగాలు, రచనలకు ప్రసిద్ధి చెందిన స్వామి గౌతమానంద్‌జీ అనేక దేశాలను సందర్శించి రామకృష్ణ సందేశాన్ని ప్రచారం చేశారు.

Muslim University: అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

Published date : 26 Apr 2024 11:33AM

Photo Stories