Skip to main content

Global Investors Summit: రాష్ట్రానికి సీఎం జ‌గ‌నే బ్రాండ్ అంబాసిడర్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు.
AP Minister Appalaraju

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు మాట్లాడారు.
చ‌ద‌వండి:  సీఎం జగన్‌ యువ నాయకత్వం.. దార్శనికతతో రాష్ట్రం వృద్ధి బాట‌లో
సీఎం జగన్ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయ‌ని అప్పలరాజు పేర్కొన్నారు. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్‌ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రెండో రోజైన శ‌నివారం కొనసాగుతోంది.

Published date : 04 Mar 2023 11:11AM

Photo Stories