Skip to main content

Nepal: పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ ర్యాలీని ఎవరు ప్రారంభించారు?

Amrit Mahotsav Motorcycle Rally

భారత 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా నేపాల్‌ నుంచి వారణాసికి ‘పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ అమృత్‌ మహోత్సవ్‌ మోటారు సైకిల్‌ ర్యాలీ’ నవంబర్‌ 11న ప్రారంభమైంది. ఖాట్మాండులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పశుపతినాథుని ఆలయం వద్ద నేపాల్‌ సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రి ప్రేమ్‌ బహదూర్‌ అలే, భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వత్రాలు ర్యాలీని ప్రారంభించారు. భారత్, నేపాల్‌ల మధ్య స్నేహానికి చిహ్నంగా.. ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ సంస్థతో కలిసి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఇందులో దాదాపు 50 మంది భారతీయులు, నేపాలీలు మోటార్‌బైక్‌లతో పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ అమృత్‌ మహోత్సవ్‌ మోటారు సైకిల్‌ ర్యాలీ ప్రారంభం
ఎప్పుడు  : నవంబర్‌ 11
ఎవరు    : నేపాల్‌ సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రి ప్రేమ్‌ బహదూర్‌ అలే, భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వత్రా
ఎక్కడ    : పశుపతినాథుని ఆలయం, ఖాట్మాండు, నేపాల్‌
ఎందుకు : భారత్, నేపాల్‌ల మధ్య స్నేహానికి చిహ్నంగా.. ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు...

చ‌ద‌వండి: భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Nov 2021 04:51PM

Photo Stories