Skip to main content

Electricity: భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?

Electricity

తమ దేశంలోని మిగులు విద్యుత్తును భారత్‌కు విక్రయించాలని నేపాల్‌ నిర్ణయించింది. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ చేసిన  ప్రయత్నాల మేరకు తాజాగా భారత్‌ విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఈ కొనుగోళ్లకు అనుమతి మంజూరు చేసింది. భారత్‌ సాయంతో నిర్మించిన రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి తొలివిడతగా విక్రయాలు జరుగుతాయి. విద్యుదుత్పత్తిలో మిగులు సాధించిన దేశంగా నేపాల్‌ ఉంది.

నేపాల్‌ రాజధాని: ఖాట్మండు; కరెన్సీ: నేపాలిస్‌ రుపీ
నేపాల్‌ ప్రస్తుత అధ్యక్షురాలు: విద్యాదేవి భండారీ
నేపాల్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: షేర్‌ బహదూర్‌ దేవ్‌బా

సరయూ నదీ ఏ రాష్ట్రంలో ఉంది?

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నదీతీరంలో నిర్వహించిన దీపోత్సవ్‌లో లక్షలాది ప్రమిదలను వెలిగించారు. తొమ్మిది లక్షల ప్రమిదలు వెలిగించడంతో కొత్త గిన్నిస్‌ రికార్డు నమోదైంది.
 

చ‌ద‌వండి: తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దని తెలిపిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌కు విద్యుత్‌ను విక్రయించనున్న దక్షిణాసియా దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : నేపాల్‌
ఎందుకు : తమ దేశంలో మిగులు విద్యుత్తు ఉన్నందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Nov 2021 04:59PM

Photo Stories