Skip to main content

NSS Award: కాకతీయ వర్సిటీకి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా అవార్డులందుకుంటున్న మైసూరారెడ్డి,  సుంకరి జ్యోతి
రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా అవార్డులందుకుంటున్న మైసూరారెడ్డి,  సుంకరి జ్యోతి

2020–2021 సంవత్సరానికి జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. సెప్టెంబర్ 24న  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 3 వేర్వేరు విభాగాలలో జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 అవార్డులు లభించాయి. విద్యాసంస్థల కేటగిరీలో తెలంగాణ నుంచి కాకతీయ యూనివర్సిటీ ద్వితీయ స్థానం సాధించగా డాక్టర్‌ సుంకరి జ్యోతి, వాలంటీర్‌ కేటగిరీలో శ్రేయాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన కూచూరు మైసూరారెడ్డి అవార్డులు అందుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రోగ్రాం ఆఫీసర్‌ కేటగిరీలో జేఎన్‌టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వాలంటీర్‌ కేటగిరీలో నెల్లూరుకు చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన సిరి దేవనపల్లికి అవార్డులను ప్రదానం చేశారు.   

Also read: Times of India Awards : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు.. దేశంలోనే అత్యుత్తమ..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Sep 2022 07:31PM

Photo Stories