Skip to main content

గవర్నెన్స్‌ నౌ అవార్డుకు ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థ?

కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామస్థాయిలో నిరాటంకంగా విత్తనాలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీ సీడ్స్‌)ను ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు వరించింది.
AP Seeds
AP Seeds

అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ‘గవర్నన్స్‌ నౌ’ అంతర్జాతీయ సంస్థ గత ఏడేళ్లుగా అవార్డులను ప్రదానం చేస్తోంది. 2021 ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ (పీఎస్‌యూ) యూనిట్స్‌ కేటగిరీలో ఏపీ సీడ్స్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. ఏపీ సీడ్స్‌ సేవలను గుర్తిస్తూ 8వ పీఎస్‌యూ గవర్నెన్స్‌ నౌ నేషనల్‌ అవార్డుకు ఎంపిక చేశారు. జూలై 29న ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ముఖ్య అతిధిగా పాల్గొని ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబుకు అవార్డును ప్రదానం చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గవర్నెన్స్‌ నౌ అవార్డుకు ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థ?
ఎప్పుడు    : జూలై 29
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీ సీడ్స్‌)
ఎందుకు    : కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామస్థాయిలో నిరాటంకంగా విత్తనాలు పంపిణీ చేసి... అత్యుత్తమ ప్రతిభ కనపర్చినందుకు...
 

Published date : 30 Jul 2021 06:32PM

Photo Stories