Skip to main content

Good News: ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇకపై ఎక్కడి నుంచైనా..!

ప్రముఖ సోషల్ ఈ-కామర్స్ యునికార్న్ కంపెనీ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది.
Work From Home
Work From Home Happy

దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కంపెనీ ఉద్యోగులు పని చేయొచ్చు అని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రే తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. "మేము శాశ్వతంగా సరిహద్దులేని పని విధానాన్ని అవలంబిస్తున్నాము. ఇక ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు" అని తెలిపారు.
"ఈ అనిశ్చిత ప్రపంచంలో, వ్యాపార వృద్ధి వాస్తవానికి స్థితిస్థాపక & ఉత్పాదక శ్రామిక శక్తిపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించడానికి మేము బహుళ నమూనాలను అధ్యయనంచేశాము!" అని ఆయన అన్నారు. ఉద్యోగుల మానసిక, శారీరక భద్రత పని చేసే స్థానం కంటే ముఖ్యమని వ్యాపార నాయకులు అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీషో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్న కార్యాలయాలను తెరుస్తుందని, ప్రధాన కార్యాలయం బెంగళూరులో కొనసాగుతుందని ఆత్రే తెలిపారు.

Published date : 07 Feb 2022 05:01PM

Photo Stories