Skip to main content

గుర్తింపులేని డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు నిలిపివేత: ఉన్నత విద్యామండలి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేట్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను 2021–22 విద్యాసంవత్సరానికి నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీల గుర్తింపు లేకపోవడం, మూడేళ్లుగా ఎలాంటి అడ్మిషన్లు కూడా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలేజీలకు నోటీసులు జారీచేశామని, నెలరోజుల్లో ఆయా యాజమాన్యాలు తమ వివరణలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని పేర్కొన్నారు.

అడ్మిషన్లు నిలిపివేసిన కాలేజీల సంఖ్య..

వర్సిటీలు

కాలేజీలు

ఆంధ్రా యూనివర్సిటీ

06

ఆచార్య నాగార్జున వర్సిటీ

08

ఆదికవి నన్నయ వర్సిటీ

05

యోగివేమన వర్సిటీ

04

కృష్ణా వర్సిటీ

13

రాయలసీమ వర్సిటీ

03

విక్రమసింహపురి వర్సిటీ

01

మొత్తం

40


కొన్ని కాలేజీల్లోని అడ్మిషన్లు నిలిపివేయనున్న ప్రోగ్రాములు ఇలా..

వర్సిటీలు

కాలేజీలు

ప్రోగ్రాములు

ఆంధ్రా యూనివర్సిటీ

40

62

శ్రీవేంకటేశ్వర వర్సిటీ

30

58

ఆచార్య నాగార్జున వర్సిటీ

29

42

శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ

15

34

ఆదికవి నన్నయ వర్సిటీ

42

54

యోగివేమన వర్సిటీ

15

24

బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ

16

29

కృష్ణా వర్సిటీ

30

58

రాయలసీమ వర్సిటీ

22

54

విక్రమసింహపురి వర్సిటీ

18

39

మొత్తం

257

454

Published date : 27 Aug 2021 05:31PM

Photo Stories