APPSC Group-1 Exam 2023: RTOగా AU పరిశోధక విద్యార్థి.. గోపిశెట్టి మనోహర్
Sakshi Education
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం జాగ్రఫీ విభాగం పరిశోధక విద్యార్థి గోపిశెట్టి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–1 పరీక్షల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు.
APPSC Group-1 Exam 2023 Ranker G Manohar
మనోహర్ 2018లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించి, ఏయూలో పీహెచ్డీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1 అధికారిగా మనోహర్ ఎంపిక కావడంపై హర్షం వీసీ ప్రసాదరెడ్డి వ్యక్తం చేశారు. శుక్రవారం వీసీ కార్యాలయంలో ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు పి.సునీత, ఆచార్య టి.వి.కృష్ణ, ఆచార్య అనూజ టిగ్గ పాల్గొన్నారు. అనంతరం మనోహర్ను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ అభినందించారు.