Post Graduation Courses : డిగ్రీ కళాశాలలో ఈ రెండు పీజీ కోర్సులు మంజూరు.. దరఖాస్తుకు వీరే అర్హలు!
Sakshi Education
![Approval of Two Post Graduation courses in degree college in AP](/sites/default/files/images/2024/07/08/pg-courses-degree-college-1720433514.jpg)
నరసన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు రెండు మంజూరయ్యాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ పి.లత తెలిపారు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులు మంజూరయ్యాయని తెలిపారు. దీనికి సంబంధించిన అఫిలియేషన్ ప్రక్రియపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులతో చర్చించి తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎంఎస్సీ కంప్యూటర్స్, కెమిస్ట్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్టల్ సౌకర్యం కూడా ఉందని అన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీపీజీసీఈటీలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు.
Campus Drive : ప్రభుత్వ ఐటీఐలో క్యాంపస్ డ్రైవ్.. దరఖాస్తులకు ఈ పత్రాలు తప్పనిసరి..
Published date : 08 Jul 2024 03:41PM