సాక్షి, న్యూఢిల్లీ: గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన యూత్ పార్లమెంట్లో మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజపేయిపై కామారెడ్డికి చెందిన కె.మౌనిక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
కె.మౌనిక
వాజపేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది డిసెంబర్ 25న యూత్ పార్లమెంట్లో మౌనిక పాల్గొంది. కామారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జని్మంచిన మౌనిక తండ్రి డీసీఎం వ్యాన్ డ్రైవర్ కాగా, తల్లి బీడీలు చుడుతూ జీవిస్తున్నారు.